కరోనా కారణంగా భర్తకు భార్య అంతిమ సంస్కారాలు

by సూర్య | Tue, Jun 08, 2021, 10:04 AM

జీవితాంతం కలసి ఉండాల్సిన ఆ భార్య భర్తలతో విధి వింత నాటక మాడింది. సాఫీగా సాగిపోతున్న వారి సంసారాన్ని అనుకోని ఘటన ఊహించని మలుపుతిప్పింది. అనారోగ్యంతో కట్టుకున్న భర్త కన్ను మూయటంతో కట్టుకున్న భార్యే చితి మంటలతో సాగనంపాల్సి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్ధానికులకు కన్నీరు తెప్పించింది. టెక్కలి మండలం లింగాలవలస గ్రామానికి చెందిన పొన్నాడ శ్రీనివాసరావు (35)కు అదే గ్రామానికి చెందిన హైమావతితో 8ఏళ్ల క్రితం వివాహం జరిగింది. శ్రీనివాసరావు రైల్వేలో పని చేస్తున్నాడు. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. అనారోగ్యంతో శ్రీనివాసరావు మృతి చెందాడు. శ్రీనివాసరావుకు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఎవరూ లేకపోవటం, పిల్లలు చిన్నవారు కావటంతో.. చేసేది లేక భార్య హైమావతి తన భర్త చితికి నిప్పంటించి అంతిమ సంస్కారాలు నిర్వహించింది.

Latest News

 
ప్రధాని మోదీతో మాట్లాడే ధైర్యం సీఎం జగన్ కు లేదు : పవన్ కళ్యాణ్ Wed, Apr 17, 2024, 11:18 PM
అన్న జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి.. తమ్ముడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Wed, Apr 17, 2024, 09:27 PM
దంచికొడుతున్న ఎండలు.. గురువారం ఆ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు Wed, Apr 17, 2024, 09:26 PM
ఏపీ ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల సంఘం ట్విస్ట్.. కీలక ఆదేశాలు, గీత దాటితే వేటు Wed, Apr 17, 2024, 09:22 PM
ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు Wed, Apr 17, 2024, 09:15 PM