రాతపరీక్ష లేకుండా ప్రభుత్వరంగ సంస్థలో 1,086 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి ఇలా.!

by సూర్య | Mon, Jun 07, 2021, 12:52 PM

ప్రభుత్వరంగ సంస్థ కోల్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్‌ లిమిటెడ్‌ "ఈసీఎల్‌" వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1086 సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేస్తున్నది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపికచేయనుంది. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వెల్లడించింది. ఎంపికైనవారిని జనరల్‌ మేనేజర్‌ ఆఫీసులు, సీనియర్‌ మేనేజర్‌ ఆఫీసుల ఈసీఎల్‌ పర్సనల్‌ డిపార్టమెంట్‌ వద్ద నియమిస్తారు.


మొత్తం పోస్టులు 1,086 ఉన్నాయి. ఇందులో జనరల్‌ 842, ఎస్సీ 163, ఎస్టీ 81 చొప్పున ఖాళీలు ఉన్నాయి. అర్హతలు: అభ్యర్థులు ఏడో తరగతి పాస్ అయ్యి ఉండాలి


ఎంపిక విధానం: ఫిజికల్‌ టెస్ట్‌ ద్వారా


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని పూర్తిగా నింపి ఈ-మెయిల్‌ చేయాలి.


ఈ-మెయిల్‌: bhartiecl@gmail.com


దరఖాస్తులకు చివరితేదీ: జూన్‌ 15


వెబ్‌సైట్‌: http://www.easterncoal.gov.in/

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM