by సూర్య | Mon, Jun 07, 2021, 10:59 AM
కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవలిలో విషాదం చోటు చేసుకుంది. భూతవైద్యానికి నరేష్ అనే యువకుడు బలయ్యాడు. నరేష్ కొంతకాలంగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. అతడిని అతని తల్లిదండ్రులు భూతవైద్యుడికి చూపించారు. నరేష్కు దయ్యం పట్టిందని భూత వైద్యుడు కర్రలతో కొట్టాడు. దీంతో ఆ యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. కర్నూలు జీజీహెచ్లో చికిత్స పొందుతూ నరేష్ నేడు మృతి చెందాడు.
Latest News