by సూర్య | Sat, Jun 05, 2021, 02:52 PM
ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వ సహకారం లేదని... మందు పంపిణీ జరగదని.. దయచేసి ఎవరూ కృష్ణపట్నం రావొద్దని ఆనందయ్య సన్నిహితుడు సంపత్ రాజు తెలిపారు. కృష్ణపట్నంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారన్నారు. ఆనందయ్య రోజుకి అయిదు వేల మందికి సరిపడే మందు మాత్రమే తయారు చేయగలరన్నారు. ప్రభుత్వం జిల్లాల వారీగా లక్షల మందికి పంపిణీ చేయమనడం సరికాదన్నారు. ప్రాణాపాయ స్థితిలో వచ్చేవారికి మందు ఇవ్వలేక, ఆనందయ్య కన్నీళ్లు పెట్టుకుంటున్నారన్నారు. ప్రభుత్వం సహాకారం అందిస్తేనే మందు పంపిణీ సాధ్యమన్నారు. ఆన్ లైన్లో మందు ఇవ్వలేమని సంపత్ రాజు వెల్లడించారు.
Latest News