by సూర్య | Sat, Jun 05, 2021, 11:33 AM
విశాఖకు చెందిన చిన్నారి సింధు శ్రీ అనుమానాస్పద మృతి కేసును విశాఖ పోలీసులు ఛేదించారు. చిన్నారి తల్లి వరలక్ష్మి జగదీష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. సింధు శ్రీని తానే పాత మార్చానని పోలీసుల విచారణలో జగదీష్ ఒప్పుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారిని కొట్టి గాయపరిచాడు. చిన్నారికి ఒంట్లో బాగాలేదని నమ్మించేందుకు పలు ఆసుపత్రులకు తీసుకు వెళ్లినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. చిన్నారి హత్యకేసులో తల్లి వరలక్ష్మి పాత్ర పైన కూడా పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.4 రోజుల క్రితం చిన్నారి సింధు శ్రీ అనుమానస్పద మృతిపై తండ్రి రమేష్ ఫిర్యాదుతో దారుణం బయటపడింది.
Latest News