by సూర్య | Fri, Jun 04, 2021, 10:03 AM
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తిరువూరు మండలం టేకుపల్లిలో సత్యనారాయణ అనే వ్యక్తి భార్య, కొడుకుపై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర గాయాలతో పద్మావతి (55) అక్కడికక్కడే మృతి చెందింది. కొడుకు చిన్నబాబు పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడు సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాలతోనే సత్యనారాయణ భార్య, కొడుకులపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Latest News