by సూర్య | Mon, May 31, 2021, 02:43 PM
కరోనా పరిస్థితుల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూను పొడిగించింది. ఇప్పటికే విధించిన కర్ఫ్యూ గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సహా పలువురు ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సడలింపు, లాక్ డౌన్ వేళలు యదాతధంగా కొనసాగింపుకు సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రస్తుతం ఉన్నట్లే ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ మినహాయింపు ఉంటుంది. సడలింపు సమయంలో కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
Latest News