by సూర్య | Mon, May 31, 2021, 02:12 PM
జీజీహెచ్లో చికిత్స పొందుతూ రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి చెందారు. ఆయన మృతిపై స్పందించిన ఆనందయ్య మిత్రుడు ఓ వీడియో పోస్టు చేశారు. ఆనందయ్య మందువల్ల బాగుందని చెప్పిన కోటయ్య వీడియో వైరల్ అయిందన్నారు. ఈ నెల 20వ తేదీన కంటి చుక్కల మందుకు మాత్రమే ఆయన కృష్ణపట్నం వచ్చారని, అప్పటికే ఆయనకు కోవిడ్ వచ్చి తగ్గిపోయిందన్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వల్ల ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నాయని చెప్పడంతో చుక్కల మందు వేయడంతో ఆక్సిజన్ లెవల్స్ పెరిగాయన్నారు. ఆ తర్వాత ఆయన ఆస్పత్రిలో ఉంటే తాము వెళ్లి మాట్లాడామని, ఆయనకు 80 శాతం ఊపిరితిత్తులు పాడయ్యాయన్నారు. అలాగే వేరే ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ చనిపోయారన్నారు. అయితే ఆనందయ్య మందుతో చనిపోయాడని చెప్పడం చాలా బాధాకరమని అన్నారు. ఇలాంటి వార్తలు ప్రచారం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
Latest News