by సూర్య | Mon, May 31, 2021, 09:50 AM
ఏపీలో కర్ఫ్యూ ఆంక్షలు నేటితో ముగియనున్నాయి. ఆంక్షల పొడిగింపుపై ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ఈరోజు నిర్ణయం తీసుకోనున్నారు. మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన అనంతరం కోవిడ్పై సీఎం సమీక్షించనున్నారు. కేసులు తగ్గుముఖం పట్టినా పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకురావాలని సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 వరకు కర్ఫ్యూ నుండి మినహాయింపు ఉంది. అదే విధానాన్ని కొనసాగిస్తారా లేక మరో గంట సడలింపు ఇస్తారా అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.
Latest News