by సూర్య | Sun, May 30, 2021, 01:37 PM
వైసీపీ రెండేళ్ల పాలనపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదివారం పుస్తకాన్ని ఆవిష్కించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలన అందిస్తున్నామన్నారు. మెనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని, ప్రతి ఒక్కరి సహాయంతో ఇవన్నీ చేయగలుగుతున్నామన్నారు. రాష్ట్రంలో 86 శాతం ఇళ్లకు ప్రభుత్వ పథకాలు చేరాయన్నారు. ప్రజల ఖాతాల్లోకి నేరుగా రూ. 95,528 కోట్లు జమ చేశామన్నారు. వివిధ పథకాల ద్వారా రూ. 36,197 కోట్లు ఇచ్చామన్నారు. ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా కల్పించామని సీఎం జగన్ అన్నారు.
Latest News