నాలుగు కార్లలో పెద్ద ఎత్తున ఆనందయ్య మందు ఎత్తుకెళ్లిన మంత్రి

by సూర్య | Sun, May 30, 2021, 11:08 AM

ఆయుర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్య మందుకు ప్రభుత్వ అనుమతిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఆనందయ్య ఇంకా కృష్ణపట్నం గోపాలపురంలోని కేపీఎస్ఎస్పీఎల్ అకాడమీలోనే ఉన్నారు. ఆనందయ్య చుట్టూ పోలీసులు వలయంలా ఉన్నారు. మరోవైపు పెద్దల కోసం పెద్ద ఎత్తున మందు తయారీ చేస్తూనే ఉన్నారు. నిన్న అనగా శనివారం నాడు నాలుగు నల్ల రంగు కార్లలో బకెట్లతో మందు ఎత్తుకెళ్లినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఆ కార్లలో మందు తీసుకెళ్లింది.. కృష్ణా జిల్లాకి చెందిన ఓ మంత్రి అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఓ వైపు ప్రభుత్వం ఎప్పుడెప్పుడు అనుమతి ఇస్తుందా..? కృష్ణపట్నం ఎప్పుడు వెళ్దామా..? అని లక్షలాది మంది జనాలు వేచి చూస్తుండగా.. కొందరు పెద్దలు మాత్రం ఇలా కార్లలో వచ్చి మందు తీసుకెళ్లడం గమనార్హం. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 21 నుంచి ఆనందయ్య మందు పంపిణీ ఆగిపోయిన సంగతి తెలిసిందే.

Latest News

 
ట్రాక్టర్ ఢీకొని యువకుడికి గాయాలు Thu, Apr 18, 2024, 03:38 PM
మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించండి: కొరముట్ల Thu, Apr 18, 2024, 03:37 PM
కొండాపురంలో వారాల తరబడి నీళ్లు రావడం లేదు Thu, Apr 18, 2024, 03:33 PM
నేడు కె. వి. ఆర్. ఆర్ పురంలో ఎన్డీఏ కూటమి ఇంటింటి ప్రచారం Thu, Apr 18, 2024, 03:30 PM
టిడిపిలో చేరిన వైకాపా నేతలు Thu, Apr 18, 2024, 03:28 PM