by సూర్య | Sat, May 29, 2021, 04:40 PM
విశాఖలోని శ్రీకాంతి థియేటర్ ప్రాంగణంలోచిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జనసేన ప్రధానకార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ కోవిడ్ రోగులకు ఆక్సిజన్ కొరత లేకుండా చేయాలనే చిరంజీవిగారి లక్ష్యమన్నారు. పేదరోగులకు అవసరం మేరకు ఇంటికే సిలిండర్ పంపిస్తామని తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో కొరత తీర్చడానికి ప్రతి జిల్లాలో అక్సిజన్ బ్యాంకులు తెరుస్తున్నామని చెప్పారు. జిల్లాల వారీగా ప్రజలను ఆదుకోడానికి చిరంజీవి అభిమానులు సేవలు అందిస్తారని సత్యనారాయణ వెల్లడించారు.
Latest News