మందు తయారీకి తగిన సామాగ్రి లేదు ఎవరూ కృష్ణపట్నం రావద్దు : ఆనందయ్య

by సూర్య | Fri, May 28, 2021, 04:45 PM

కరోనా బాధితులకు తాను పంపిణీ చేస్తున్న ఆయుర్వేద ఔషధానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇంకా అనుమతులు ఇవ్వలేదని ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తెలిపారు. నేటి నుంచి మందు పంపిణీ జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో నిజంలేదని ఆయన పేర్కొన్నారు. ఔషధ తయారీకి అవసరమైన ఆకులు, దినుసులు సిద్ధంగా లేవని చెప్పారు. వదంతులు నమ్మి ఎవరూ కృష్ణపట్నానికి రావద్దని కోరారు. ఇదిలాఉండగా ఆనందయ్య ఇస్తున్న మందులో ఎలాంటి హానికర పదార్ధాలు లేవని ఆయూష్ అధికారులు ఇప్పటికే తేల్చి చెప్పడంతో అనుమతి ఎప్పుడు వస్తుందా అని అంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆనందయ్య మందుపై తాజాగా హైకోర్టులో విచారణ జరిగినది. 

Latest News

 
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Thu, Apr 25, 2024, 01:29 PM
కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం Thu, Apr 25, 2024, 01:27 PM
ప్రచారంలో టపాసులు కాల్చారని కేసు Thu, Apr 25, 2024, 01:24 PM
రేపు గుడ్లూరు రానున్న నందమూరి బాలకృష్ణ Thu, Apr 25, 2024, 01:18 PM
అంతంతమాత్రంగా ఎన్నికల కోడ్ అమలు Thu, Apr 25, 2024, 01:13 PM