by సూర్య | Fri, May 28, 2021, 03:51 PM
ఏన్టీఆర్ 98వ జయంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ శ్రీ రామ దండకం పాటను విడుదల చేశారు. బాలకృష్ణ స్వయంగా ఈ పాటను పాడారు. కాగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను చరిత్రలో నిలిచిపోయేలా చేసుకుందామని చెప్పుకొచ్చారు బాలయ్య. పేదవారి వెన్నపూస తెలుగుజాతి వెన్నుపూస ఎన్టీఆర్ కు శ్రీ రామ దండకం అంకితమని బాలయ్య ఏకధాటిగా పాడి ఆలపించారు.కాగా అభిమానులు టిడిపి కార్యకర్తలు బాలయ్య పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. గతంలో బాలయ్య శివశంకరీ పాట, అలాగే పైసా వసూలు మామ ఏక్ పెగ్ లా అంటూ కొన్ని పాటలను పాడారు.
Latest News