by సూర్య | Thu, May 27, 2021, 11:22 AM
ఇంజనీరింగ్ అధికారులు పోలవరంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం చేశారు. దీంతో గోదావరి వరద దిశ మారనుంది. 42.5 మీటర్ల ఎత్తులో కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తి అయింది. సహజసిద్ధంగా వెళుతున్న గోదావరి నదిని అధికారులు మూసివేశారు. స్పిల్వే ద్వారా నీటి తరలింపుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ యేడాది 14 గేట్ల ద్వారా ప్రాజెక్టు స్పిల్వే నుంచి గోదావరి వరదను తరలించనున్నారు. కాగా ఇప్పటికే స్పిల్ చానల్ పనులు పూర్తయ్యాయి.
Latest News