by సూర్య | Tue, May 25, 2021, 03:53 PM
యాస్ తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష జరిపారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం కలెక్టర్లతో సమీక్ష జరిపిన సీఎం అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తుపాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వాతావరణశాఖ నివేదికలు పరిశీలించి తుఫాన్ కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. మంత్రులు బొత్స, కన్నబాబు, అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.
Latest News