by సూర్య | Mon, Apr 12, 2021, 03:03 PM
అమరావతి: టీడీపీ, బీజేపీ నేతలకు అజెండా లేదని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. సోమవారం మంత్రి పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చమని చెప్పారు. తామేం చేశామో చెప్పాకే ఓట్లు అడుగుతున్నామని స్పష్టం చేశారు. తండ్రీకొడుకులకు నాలుకకు నరం లేదని ఎద్దేవా చేశారు. టీడీపీ, బీజేపీ విష ప్రచారంపైనే ఆధారపడ్డాయని పేర్నినాని తెలిపారు. తిరుపతి ఎన్నికల్లో ఏం చెప్పాలో వాళ్లకు తోచడంలేదని పేర్నినాని అన్నారు.
Latest News