by సూర్య | Mon, Apr 12, 2021, 01:00 PM
పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు మరోసారి సీబీఐ అధికారులు కడప జిల్లా పులివెందుల వచ్చారు. ఆర్అండ్బీ అతిథి గృహంలో వివేకా ప్రధాన అనుచరుడు గంగిరెడ్డిని అధికారులు విచారిస్తున్నారు. సాక్ష్యాల తారుమారు కేసులో రెండేళ్ల క్రితమే గంగిరెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
పట్టణానికి చెందిన ఓ సెల్పాయింట్, మిల్క్డెయిరీ నిర్వాహకులను ఆర్అండ్బీ అతిథిగృహంలో నిన్న అధికారులు విచారించారు. ఈ కేసులో మరికొందరు అనుమానితులను విచారించనున్నారు.
Latest News