తమ్ముడి చేతిలో అన్న దారుణ హత్య

by సూర్య | Mon, Apr 12, 2021, 11:19 AM

నంద్యాల మండలంలోని కొణిదేడు గ్రామంలో ఆదివారం రాత్రి తల్లితో గొడవ పడొద్దని మందలించిన అన్నను తమ్ముడు హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. మధు , స్వామినాయుడు సోదరులు. తమ్ముడు తల్లి మద్దిలేటమ్మతో గొడవపడుతుండగా అన్న ఎందుకు అనవసరంగా వాదులాడుతున్నావని అడుకున్నాడు. ఇది కాస్తా ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది. ఆవేశంలో ఉన్న తమ్ముడు స్వామి నాయుడు కత్తి తీసుకుని మధు తొడ భాగంలో పొడవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే మధుని శాంతిరాం హాస్పిటల్ కి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మధు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా హతుడి తమ్ముడు పరారీలో ఉన్నాడు.

Latest News

 
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Thu, Apr 25, 2024, 01:29 PM
కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం Thu, Apr 25, 2024, 01:27 PM
ప్రచారంలో టపాసులు కాల్చారని కేసు Thu, Apr 25, 2024, 01:24 PM
రేపు గుడ్లూరు రానున్న నందమూరి బాలకృష్ణ Thu, Apr 25, 2024, 01:18 PM
అంతంతమాత్రంగా ఎన్నికల కోడ్ అమలు Thu, Apr 25, 2024, 01:13 PM