by సూర్య | Mon, Apr 12, 2021, 08:27 AM
ఏపీలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3,495 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,25,401 కు చేరింది. అందులో ఇప్పటివరకు 8,97,147 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 20,954 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 7,300 కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 1,053 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 31,719 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
Latest News