by సూర్య | Mon, Apr 12, 2021, 08:03 AM
ఏపీలో వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా ఉగాది పండుగను పురస్కరించుకుని వారికి సత్కారం, అవార్డుల ప్రదానోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి నిర్వహించనుంది. ప్రతి జిల్లాలో రోజుకొక అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వాలంటీర్లను సత్కరించనున్నారు. సోమవారం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వాలంటీర్ల పనితీరు ఆధారంగా సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులతో 3 కేటగిరీల్లో సత్కరించనున్నారు. రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు నగదు బహుమతితో పాటు మెడల్, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జిలను వాలంటీర్లకు అందజేస్తారు. తిరుపతి లోక్సభ ఉపఎన్నికల నేపథ్యంలో చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని మే 4వతేదీ తర్వాత నిర్వహించే అవకాశం ఉంది. ప్రతి జిల్లాలో రోజుకొక నియోజకర్గం చొప్పున ఏప్రిల్ 28వతేదీ వరకు వాలంటీర్లకు సత్కార కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
Latest News