by సూర్య | Sat, Apr 10, 2021, 09:35 AM
ఐపీఎల్ లో శనివారం చెన్నై వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ముంబై వాంఖడే మైదానం వేదికగా రా.7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మహేంద్ర సింగ్ ధోనీ తనకు గురువుతో సమానం అని గతంలో రిషబ్ పంత్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే గురువుతో తాడోపేడో తేల్చుకోబోతున్నాడు పంత్. టాప్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ లేకుండా ఢిల్లీ బరిలోకి దిగుతోండగా.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ప్లేఆఫ్స్కు చేరుకోలేని పరాభవాన్ని గతేడాది యూఏఈలో చవిచూసిన ధోనీసేన మళ్లీ పుంజుకోవాలన్న కసితో ఆడబోతోంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలవబోతున్నారో కామెంట్ రూపంలో తెలపండి.
Latest News