by సూర్య | Sat, Apr 10, 2021, 08:02 AM
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షల రాత సమయాన్ని పెంచింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 11 పరీక్షలను ఆరుకు కుదించిన ప్రభుత్వం తాజాగా పరీక్షలు రాసే సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మొదటి, ద్వితీయ, తృతీయ భాష పరీక్షలకు సమయాన్ని పొడిగించారు. గణితం, సామాజిక శాస్త్రం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం పరీక్షలకు అరగంట సమయాన్ని పెంచారు. భాషలు, గణితం, సామాజిక శాస్త్రానికి 100 మార్కుల ప్రశ్నా పత్రాలు, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం పరీక్షలకు 50 మార్కుల ప్రశ్నా పత్రాలు ఉండనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కంపోజిట్ కోర్సులోని రెండో భాష (పేపర్-2)కు 1.45 గంటలు, ఒకేషనల్ కోర్సు పరీక్షకు 2 గంటల సమయాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Latest News