by సూర్య | Sat, Apr 10, 2021, 07:53 AM
ఐపీఎల్ 14 సీజన్ ఆరభ మ్యాచ్ అదిరిపోయే ఉత్కంఠను క్రియేట్ చేసింది. బెంగళూరు - ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆఖరి బంతి వరకు నరాలు తెగే టెన్షన్ పెట్టించిం. ఒక దశలో సూపర్ ఓవర్ ఖాయం అని అంతా భావిస్తున్న సమయంలో విజయం కోహ్లీ సేనను వరించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఆరంభంలోనే తడబడింది. బెంగళూరు పేసర్ హర్షల్ పటేల్ ఐదు వికెట్లతో చెలరేగడంతో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ తడబడింది. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఛేజింగ్ కు దిగిన కోహ్లీ సేన బెంగళూరు ఆఖరి బంతికి 160 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. క్రిస్ లిన్ (49), సూర్యకుమార్ (31), ఇషాన్ కిషన్ (28) రాణించగా.. హర్షల్ పటేల్ కెరీర్లో తొలిసారి 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసి గెలిచింది. డివిల్లీర్స్ (48) మ్యాక్స్వెల్ (39), కోహ్లీ (33) రాణించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా హర్షల్ నిలిచాడు.
Latest News