by సూర్య | Fri, Apr 09, 2021, 04:04 PM
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ కరోనా వ్యాక్సిన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 11 నుంచి 14 వరకు నాలుగు రోజుల పాటు టీకా ఉత్సవ్ ను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉత్సవ్ లో భాగంగా రోజుకు 6 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 4 రోజుల్లో కనీసం 24 లక్షల మందికి వ్యాక్సిన్ అందించాలని, ఇందుకోసం కేంద్రం నుంచి వ్యాక్సిన్ లను తెప్పించేందుకు ప్రయత్నం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. టీకా ఉత్సవ్ తరువాత మరిన్ని వ్యాక్సిన్లు కేంద్రం నుంచి తెప్పించుకోవాలని అధికారులను ఆదేశించారు.
Latest News