by సూర్య | Fri, Apr 09, 2021, 02:19 PM
ఏపీలోని గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొల్లిపర మండలంలో లాక్ డౌన్ విధించారు. కొల్లిపర మండలంలో వారం రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్టు తహసీల్దార్ పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి 16 వ తేదీ వరకు వారం రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు మాత్రమే వ్యాపారాలకు అనుమతులు ఇస్తున్నట్టు తహసీల్దార్ తెలిపారు. హోటల్స్, టీ స్టాల్స్ ను పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఇటీవలే భట్టిప్రోలు మండలంలో కూడా లాక్ డౌన్ విధించారు.
Latest News