ఇరువ‌ర్గాల మ‌ధ్య‌ ఘ‌ర్ష‌ణ‌.. 9 మందికి గాయాలు

by సూర్య | Fri, Apr 09, 2021, 01:42 PM

గుంటూరు జిల్లా, య‌డ్ల‌పాడు మండ‌లంలోని కారుచోల గ్రామంలో ఇరువ‌ర్గాల మ‌ధ్య గురువారం రాత్రి ఘ‌ర్ష‌ణ చెల‌రేగింది. ఈ ఘ‌ర్ష‌ణ‌లో ఇరువ‌ర్గాల వారు ఒక‌రిపై ఒక‌రు రాళ్లు, సీసాల‌తో దాడులు నిర్వ‌హించుకున్నారు. గురువారం మ‌ధ్యాహ్నం పోలింగ్‌బూత్‌లో ఓటు వేసే విష‌య‌మై టీడీపీ, వైసీపీ వారి మ‌ధ్య స్వ‌ల్ప వివాదం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో గురువారం రాత్రి ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.


సోష‌ల్ మీడియాలో ఓ వ‌ర్గం వారు పెట్టిన పోస్టింగ్ కూడా ఘ‌ర్ష‌ణ‌కు దారితీసిందని స‌మాచారం. ఈ ఘ‌ర్ష‌ణ‌లో 9మంది గాయ‌ప‌డ్డారు. విష‌యం తెలుసుకున్న చిల‌క‌లూరిపేట రూర‌ల్ సీఐ ఎం సుబ్బారావు, ఎస్ ఐ రాంబాబు, పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ఇరువ‌ర్గాల వారిని చెద‌రగొట్టారు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.

Latest News

 
ప్రధాని మోదీతో మాట్లాడే ధైర్యం సీఎం జగన్ కు లేదు : పవన్ కళ్యాణ్ Wed, Apr 17, 2024, 11:18 PM
అన్న జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి.. తమ్ముడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Wed, Apr 17, 2024, 09:27 PM
దంచికొడుతున్న ఎండలు.. గురువారం ఆ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు Wed, Apr 17, 2024, 09:26 PM
ఏపీ ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల సంఘం ట్విస్ట్.. కీలక ఆదేశాలు, గీత దాటితే వేటు Wed, Apr 17, 2024, 09:22 PM
ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు Wed, Apr 17, 2024, 09:15 PM