by సూర్య | Fri, Apr 09, 2021, 12:44 PM
ఫీజు చెల్లించలేదనే కారణంతో విద్యార్థులను తరగతులకు హాజరుకాకుండా అడ్డుకోవడం, పరీక్షా ఫలితాలను వెల్లడించకపోవడం సరికాదని ఏపీ హై కోర్టు కీలక స్పష్టం చేసింది. ఇది భౌతిక ఆన్ లైన్ తరగతులకు సైతం వర్తిస్తుందని పేర్కొంది. 2020-21 విద్యా సంవత్సరం ట్యూషన్ ఫీజును 30 శాతం తగ్గిస్తూ, ప్రైవేటు ఆన్ ఎయిడెడ్ విద్యా సంస్థలు 70 శాతం రుసుమును వసూలు చేసుకునేందుకు అనుమతి ఇస్తూ పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన జీవో 57 అమలును హై కోర్టు నిలిపివేసింది. ప్రస్తుత ఉత్తర్వులు కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.
Latest News