by సూర్య | Wed, Apr 07, 2021, 02:25 PM
భారత దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,15,736 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 630 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,28,01,785కు చేరినట్లు బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం 8,43,473 యాక్టివ్ కేసులుండగా... కరోనా నుండి ఇప్పటి వరకు 1,17,92,135 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్-19 వైరస్ సోకి ఇప్పటి వరకు 1,66,177 మంది మృతి చెందారు. కాగా ఇప్పటి వరకు 8,70,77,474 మంది టీకా వేసుకున్నారని అధికారులు తెలిపారు.
Latest News