by సూర్య | Wed, Apr 07, 2021, 01:53 PM
తిరుమల శ్రీవారి ఆలయంలో నలుగురు ప్రధాన అర్చకులను నియమిస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. వంశపారం పర్య అర్చకులలోని నాలుగు కుటుంబాలకే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు వివరించింది. గొల్లపల్లి కుటుంబం నుంచి గోపినాథ్ దీక్షితులను, తిరుపతమ్మ నుంచి నారాయణ దీక్షితులను, పైడపల్లి నుంచి రాజేశ్ దీక్షితులను, అలాగే పెద్దింటి నుంచి రవిచంద్ర దీక్షితులను నియమిస్తున్నట్లు పేర్కొంది. కైంకర్యపర అర్చకులకు ఈ అవకాశం లేదని వివరించింది.
Latest News