by సూర్య | Wed, Apr 07, 2021, 11:21 AM
విజయవాడ: తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో వైసీపీ జాతి రత్నాలని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ అన్నారు. 7 నియోజకవర్గాల్లో ఏడుగురు దందారాయుళ్లు ఉన్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి ఆగడాలకు అంతే లేదన్నారు. వైసీపీ మంత్రుల బెదిరింపులకు తిరుపతి ప్రజలు భయపడొద్దని సూచించారు. నిజం బతకాలంటే ఓటర్లు టీడీపీకి పట్టం కట్టాలన్నారు.
Latest News