by సూర్య | Tue, Apr 06, 2021, 04:31 PM
కృష్ణ జిల్లా మచిలీపట్నంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి పేర్ని వెంకట రామయ్య నాని, సతీమణి పేర్ని జయ సుధ దంపతులు కరోన మొదటి వ్యాక్సిన్ డోస్ వేయించుకున్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అనేక పరీక్షల అనంతరం వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజలు వ్యాక్సిన్ పట్ల ఎలాంటి అపోహలు పోవాల్సిన అవసరం లేదు అని తెలిపారు. తను ఆరోగ్యంగా ఉన్నానని ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలి అని కోరారు.
Latest News