by సూర్య | Sat, Apr 03, 2021, 11:52 AM
తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ అయిన అర్చకులను విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రిటైర్డ్ అయిన ప్రధాన అర్చకులతో పాటు అర్చకులు విధుల్లో చేరాలని ఆదేశాలు ఇచ్చింది. తాజా నిర్ణయంతో ప్రధాన అర్చకుడి హోదాలో రమణ దీక్షతలు ఆలయ ప్రవేశం చేయనున్నారు. కాగా ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రధాన అర్చకులు కొనసాగడంపై సందిగ్ధత నెలకొంది.
Latest News