by సూర్య | Sat, Apr 03, 2021, 08:48 AM
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న దాదాపు 45 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. శుక్రవారం 44,717 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2కోట్ల 74 లక్షల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 24,291 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Latest News