by సూర్య | Wed, Mar 31, 2021, 02:23 PM
అమరావతి: వైఎస్సార్ బీమా పథకం కింద పలు కుంటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన 12,039 కుటుంబాలకు రూ. 254కోట్ల సాయం అందించినట్లు చెప్పారు. ప్రభుత్వం వారికి తోడుగా ఉండాలనే మంచి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. గత ఏడాది ప్రభుత్వం తరఫు నుంచి రూ. 510 కోట్లు ప్రీమియం కట్టామని, ఈ ఏడాది కూడా కట్టడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇంకా 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేయాల్సి ఉందని, దీనిపై దర్యాప్తు జరిపి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులు, జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు సీఎం జగన్ తెలిపారు.వైఎస్సార్ బీమా పథకం కింద ఆర్థిక సాయం
Latest News