by సూర్య | Sat, Mar 27, 2021, 02:19 PM
పురపాలక చట్టానికి సవరణలు తెస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో ఇకపై ప్రతి కార్పోరేషన్ లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ప్రతి మున్సిపాలిటీలో ఇద్దరు వైస్ ఛైర్మన్లను ఎన్నుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇదే అంశంపై ఓ సర్వేను నిర్వహించగా..ఆంధ్రప్రదేశ్ లో రెండో డిప్యూటీ మేయర్ నియామక అంశాన్ని సమర్థిస్తారా అని అడగగా సమర్థిస్తామని 50 శాతం మంది, సమర్థించబోమని 40 శాతం, ఏమీ చెప్పలేమని మరో 10 శాతం మంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Latest News