by సూర్య | Thu, Mar 25, 2021, 05:42 PM
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 758 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 895879 కి చేరింది. మరో నలుగురు కరోనాతో మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 7201 కి చేరింది. తాజాగా కరోనా నుంచి మరో 231 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,469 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని, జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Latest News