పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం..!

by సూర్య | Wed, Mar 24, 2021, 05:12 PM

పశ్చిమగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దెందులూరులోని సింగవరం గ్రామంలో ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. ఆ కుటుంబంలో ఏం జరిగిందో తెలీదు గానీ వారంతా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దెందులూరు మండలం సింగవరం లో నివసిస్తున్న భార్యాభర్తలు వెంకట నారాయణ, కృష్ణ తులసి , వారి కొడుకు భాను వికాస్ తమ పంట పొలాల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే అక్కడ తండ్రి చనిపోగా, కొన ఉపిరితో ఉన్న కుమారుడుని, అతని భార్యని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించే లోపే కొడుకు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం కృష్ణ తులసికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రామస్థులను విచారిస్తున్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM