ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను తీసుకెళ్లిన బంధువు

by సూర్య | Wed, Mar 24, 2021, 02:23 PM

ప్రేమించి పెళ్లి చేసుకుని హాయిగా ఉంటున్న ఓ కొత్త జంట జీవితంలో బంధువు రూపంలో వచ్చిన వ్యక్తి విషాదాన్ని మిగిల్చాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ చిత్తూరులో చోటు చేసుకుంది. చిత్తూరు నగరంలోని ఇరువారానికి చెందిన రత్నావతి కుమారుడు అజిత్.. యాదమరి మండలం కోనాపల్లికి చెందిన షాలిని ప్రేమించుకున్నారు. ఎనిమిది నెలల క్రితం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.


వీరి కాపురం హాయిగా సాగుతున్న క్రమంలో షాలిని బంధువు నగేశన్ వచ్చి అజిత్ పై దాడి చేశాడు. షాలినిని బలవంతంగా తన వెంట తీసుకెళ్లాడు. ఆ తర్వాత షాలిని నచ్చజెప్పడంతో తీసుకు వచ్చి వదిలేశాడు. ఆ తర్వాత అజిత్ తో పాటు షాలినిపై కోపం పెంచుకున్న నాగేశన్.. అజిత్ తల్లికి ఫోన్ చేసి బెదిరించడం ప్రారంభించాడు. దీంతో మనస్తాపం చెందిన అజిత్ ఇరువారంలోని తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM