ఈనెల 26న ఏపీలో బస్సులు బంద్

by సూర్య | Wed, Mar 24, 2021, 11:33 AM

ఏపీలో మళ్లీ బస్సులు డిపోలకే పరిమితం అవుతున్నాయి. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు, కార్మిక సంఘాలు ఈనెల 26న బంద్‌కు పిలుపునిచ్చాయి. ఏపీలో స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా నిలిచేందుకు ఈ బంద్‌కు ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మద్దతు ఇవ్వగా.. తాజాగా అధికార పార్టీ వైసీపీ కూడా సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 26న మధ్యాహ్నం వరకు బస్సులు డిపోకే పరిమితం అవుతున్నట్టు మంత్రి పేర్ని నాని ప్రకటన చేశారు. కార్మిక సంఘాలకు మద్దతు కోసం తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.


విశాఖ స్టీల్ ప్లాంటును కొంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినా కేంద్రం తిరస్కరించిందని, ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బిడ్డింగులో పాల్గొనమని కేంద్రం సూచించిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇక ప్రత్యేక హోదా ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపీకి పట్టే పరిస్థితి వస్తుందన్నారు. ప్రత్యేక హోదా గురించి టీడీపీకి మాట్లాడే హక్కే లేదన్న ఆయన బీజేపీ చెప్పులు తుడిచే పనిలో టీడీపీ బీజీగా ఉందని ఆరోపించారు.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM