by సూర్య | Wed, Mar 24, 2021, 10:44 AM
ఏపీలో దారుణం చోటుచేసుకుంది. సీఐ హఠాత్తుగా షటిల్ ఆడుతూ చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన భగవాన్ ప్రసాద్ పశ్చిమ గోదావరి జిల్లా గణవరంలో సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. రోజూ షటిల్ ఆడటం ఆయన అలవాటు. ఎప్పటిలాగే గణవరం పోలీస్ స్టేషన్ సమీపంలో షటిల్ ఆడేందుకు వెళ్లారు. ఆట మధ్యలోనే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన తోటి క్రీడాకారులు ఆయనను పైకి లేపేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆయన నిర్జీవంగా పడిపోయారు. సీఐను వెంటనే గణవరంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు కారణంగానే సీఐ భగవాన్ మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనతో సీఐ భగవాన్ కుటుంబంలో విషాదంలోకి వెళ్లింది. అటు సీఐ మృతదేహాన్ని ఎమ్మెల్యే వాసుబాబు సందర్శించి నివాళులర్పించారు.
Latest News