షటిల్ ఆడుతూ సీఐ ఆకస్మిక మృతి

by సూర్య | Wed, Mar 24, 2021, 10:44 AM

ఏపీలో దారుణం చోటుచేసుకుంది. సీఐ హఠాత్తుగా షటిల్‌ ఆడుతూ చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన భగవాన్‌ ప్రసాద్‌ పశ్చిమ గోదావరి జిల్లా గణవరంలో సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. రోజూ షటిల్‌ ఆడటం ఆయన అలవాటు. ఎప్పటిలాగే గణవరం పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో షటిల్‌ ఆడేందుకు వెళ్లారు. ఆట మధ్యలోనే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన తోటి క్రీడాకారులు ఆయనను పైకి లేపేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆయన నిర్జీవంగా పడిపోయారు. సీఐను వెంటనే గణవరంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు కారణంగానే సీఐ భగవాన్‌ మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనతో సీఐ భగవాన్‌ కుటుంబంలో విషాదంలోకి వెళ్లింది. అటు సీఐ మృతదేహాన్ని ఎమ్మెల్యే వాసుబాబు సందర్శించి నివాళులర్పించారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM