by సూర్య | Tue, Mar 23, 2021, 05:18 PM
వైసీపీ రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయివేటైజషన్ పై రాష్ట్ర (ఎం పి) లు ఎమ్ వి వి సత్యనారాయణ, మిదున్ రెడ్డి, అఖిలపక్ష కార్మిక సంఘ నాయకులతో ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిప్పల దేవన్ రెడ్డి మాట్లాడుతూ. స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రయివేట్ పరం కాకుండా చూడాలని, నిర్వాసితులు అందరకి ఉద్యాగాలు ఇవ్వాలని, స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించేలా వత్తిడి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ట్రేడ్ యూనియన్ నాయకులు మంత్రి రాజశేఖర్, ఆదినారాయణ, వై మాష్టానప్ప, గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Latest News