ప్రియురాలిని నరికి చంపిన ప్రేమోన్మాది కేసులో కీలక మలుపు..

by సూర్య | Wed, Jan 20, 2021, 02:53 PM

ఏపీలో సంచలనం సృష్టించిన ప్రియురాలిని నరికి చంపిన ప్రేమికుడు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రియురాలిని 15 సార్లు కత్తితో పొడిచి అనంతరం ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. యువతి ప్రాణాలు బలితీసుకున్న ప్రేమోన్మాది ఢిల్లీ బాబు(19) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెనుమూరు మండలం తూర్పుపల్లి అడవిలో ఉరేసుకుని నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం తూర్పుపల్లెకు చెందిన జి.గాయత్రి (20) పూతలపట్టు మండలం చింతమాకులపల్లెకు చెందిన ఢిల్లీబాబు (19) పెనుమూరులో డిగ్రీ చదువుతున్నారు.
ఇద్దరు చదువుకునేది వేర్వేరు ప్రాంతాల్లో అయినా.. కళాశాలలకు వెళ్లేందుకు పెనుమూరు మార్గంలోనే వచ్చేవారు. అలా ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోరని భావించారు. గత నెలలో ఇంట్లో నుంచి పారిపోయి తిరుపతిలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిని గుర్తించిన పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ కౌన్సెలింగ్ లో గాయత్రి తన తల్లిదండ్రులతోనే ఉంటానని వెళ్లిపోయింది.
అప్పటి నుంచి ఢిల్లీబాబుకు దూరంగా ఉంటోంది.ప్రేమించిన యువతి తనతో ఉండటం లేదని ఢిల్లీబాబు కక్ష పెంచుకున్నాడు. ఇంటి సరకుల కోసం గాయత్రి తన బంధువుల అమ్మాయితో కలిసి మంగళవారం ద్విచక్ర వాహనంపై పెనుమూరుకు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీబాబు ఆమెను తిరుగు ప్రయాణంలో ఎంప్రాళ్లకొత్తూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో అడ్డుకున్నాడు. మాట్లాడేందుకు ప్రయత్నించగా గాయత్రి నిరాకరించింది. దాంతో వెంట తెచ్చుకున్న చిన్నపాటి చాకుతో మొదట గొంతుపై పొడవగా అది వంగిపోయింది.
మరో కత్తితో విచక్షణారహితంగా కడుపులో 15 సార్లు పొడిచాడు. అడ్డుపడితే నిన్నూ చంపేస్తానంటూ ఆమె వెంట వచ్చిన యువతిని బెదిరించాడు. ఆ యువతి సెల్‌ఫోన్‌ ద్వారా బంధువులకు సమాచారాన్ని అందించింది. ఆ సమయంలో అటుగా ఓ వ్యక్తి రావడంతో.. ఢిల్లీబాబు తన బైక్‌పై పరారయ్యాడు. గాగమ్మవారిపల్లె సమీపంలో వాహనాన్ని వదిలేసి అడవుల్లోకి పారిపోయాడు. ఈరోజు మధ్యాహ్నం తూర్పుపల్లి అడవిలో ఢిల్లీబాబు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

Latest News

 
ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్ Wed, Apr 24, 2024, 10:40 AM
నేడు తిరుమల దర్శన టిక్కెట్లు విడుదల Wed, Apr 24, 2024, 10:38 AM
మాధవరం-1లో బస్సు, లారీ ఢీ Wed, Apr 24, 2024, 10:30 AM
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM