by సూర్య | Wed, Jan 20, 2021, 01:44 PM
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తరహాలో భీమడోలు మండలం పూళ్లలో అంతు చిక్కని వ్యాధి కలకలం సృష్టిస్తోంది. మూర్ఛ రావడం, నురగలు కక్కడం, కళ్లు తిరిగి పడిపోవడం, కొందరికి ఒళ్లు, తలనొప్పులు ఉండటం వంటి లక్షణాలు ఈ వ్యాధి బాధితుల్లో కనిపిస్తున్నాయి. దిశ కథనం ప్రకారం.. తాజా సమాచారం మేరకు ఈ వింత వ్యాధి బాధితుల సంఖ్య 31కు చేరింది. చుట్టు పక్కల గ్రామాలకు కూడా ఈ వింత వ్యాధి వ్యాపిస్తోంది. గుండు గొలను, అరుంధతీ కాలనీ,వడ్లకట్ల, అర్జావారి గూడెంలోనూ వింత వ్యాధి సోకింది. కాగా భీమడోలులో వైద్యులు ఇద్దరికి చికిత్స అందించారు. మరో ముగ్గురిని ఏలూరుకు తరలించారు. ఆహార పదార్థాల శాంపిల్స్ ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరించారు.
Latest News