by సూర్య | Wed, Jan 20, 2021, 12:46 PM
పంచాయితీ ఎన్నికల నిర్వహణపై అభ్యంతరాలను 7 పేజీల లేఖ ను గవర్నర్ కు ఏపీ అమరావతి ఉద్యోగుల సంఘం జెఏసీ చైర్మన్, బొప్పరాజు వెంకటేశ్వర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సంక్షోభ సమయంలోనూ ప్రభుత్వ ఉద్యోగులు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రభుత్వ అభ్యర్ధనను వ్యతిరేకించి ఎన్నికల నిర్వహణకు సిద్ధవడం జీర్ణించుకోలేకపోయామని ... ఎన్నికల ప్రక్రియ ఒకరోజులో అయ్యేది కాదు కాదని ఆయన పెర్కోన్నారు . తెలంగాణాలో మునిసిపల్ ఎన్నికలు జరిపితే ముప్ఫై శాతం ఓటింగ్ దాటలేదని గుర్తు చేశారు. ఎన్నికల కమీషన్ పంతానికీ.. మా ప్రాణాలను పణంగా పెడతారా...అని ప్రశ్నించారు. హైకోర్టులో నోటిఫికేషన్ సస్పెండ్ అయినా వదలకుండా ఎస్ఈసీ డివిజన్ బెంచ్ కు వెళ్ళారు ఎస్ఈసీ కి ఇంత పంతం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ విచక్షణ అధికారాలతో ఈ అంశాన్ని పరిశీలించాలని కోరామని దినిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు వెల్లడిచారు.
Latest News