విజయవాడ హైవేపై బోల్తాపడ్డ లారీ

by సూర్య | Wed, Jan 20, 2021, 08:00 AM

యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌ సమీపంలో లారీ బోల్తా పడింది. షాంపూ లోడ్‌తో విజయవాడ నుంచి హైదారాబాద్‌ వైపు వస్తున్న లారీ చౌటుప్పల్‌ మండలంలోని కైతాపురం వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. లారీ.. రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాలను దారిమళ్లిస్తున్నారు. క్రేన్‌ సహాయంతో లారీని తొలగిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని పోలీసులు తెలిపారు. 

Latest News

 
ఆర్ ఓ కార్యాలయం వద్ద బందోబస్తు Fri, Apr 19, 2024, 02:56 PM
21న టీడీపీ అభ్యర్థులకు చివరిగా బీ ఫారాలు Fri, Apr 19, 2024, 02:55 PM
దోచుకో, దాచుకో అనేవిధంగా వైసీపీ పాలన సాగింది Fri, Apr 19, 2024, 02:55 PM
ఒంగోలు పార్లమెంట్ కు నామినేషన్ వేసిన క్రాంతి కుమార్ Fri, Apr 19, 2024, 02:54 PM
రేపు నామినేషన్‌ వేయనున్న బగ్గు రమణమూర్తి Fri, Apr 19, 2024, 02:53 PM