by సూర్య | Tue, Jan 19, 2021, 02:52 PM
జగన్ సర్కార్ కి హైకోర్టులో మరో షాక్ తగిలింది. రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ప్రభుత్వం పెట్టిన కేసులను హైకోర్టు కొట్టేసింది. కిలారు రాజేష్తో పాటు మరింత మంది రాజధానిలో భూములు ముందుగానే కొని లబ్ధిపొందారని ప్రభుత్వం ఆరోపించింది. భూములు అమ్మినవారు ఎవరూ ఫిర్యాదు చేయలేదని ప్రభుత్వం కక్షసాధిస్తోందని క్వాష్ పిటిషన్ ను కిలారు రాజేష్ హైకోర్టులో వేశారు. అమ్ముకున్నవారు ఫిర్యాదు చేయకుండా కేసులు ఎలా పెడతారని పిటిషనర్ తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదించారు. దీంతో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఐపీసీ సెక్షన్లకు వర్తించందని స్పష్టంచేసిన కోర్టు ప్రభుత్వం పెట్టిన కేసులను కొట్టివేసింది.
Latest News