by సూర్య | Tue, Jan 19, 2021, 02:07 PM
గుంటూరులో ఐమనీ సర్వీస్ పేరుతో మోసం జరిగింది. మొబైల్, డీటీహెచ్ రీఛార్జులను ఐఎమ్ఎస్ యాప్ ద్వారా చేసుకోవచ్చని.. అందుకు 1 శాతం కమిషన్ వస్తుందని యాప్ నిర్వాహకులు డాలరాజు వెంకట్రావు, శివ అనే ఇద్దరు వ్యక్తులు ప్రచారం చేశారు. దీంతో చాలామంది చిరువ్యాపారులు ఇందులో డీలర్ షిప్ తీసుకున్నారు. వీరి వద్ద మరికొందరు సబ్ డీలర్లుగా చేరారు. అందుకోసం రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు చెల్లించారు. యాప్ మొదలుపెట్టిన నాలుగు నెలల తర్వాత యాప్ను శివ నిలిపివేశాడు. నష్టపోయామని తెలుసుకున్న బాధిత యువకులు అర్బన్ ఎస్పీకీ ఫిర్యాదు చేశారు. అలాగే గుంటూరు అర్బన్ ఎస్పీని కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు.
Latest News