by సూర్య | Tue, Jan 19, 2021, 11:19 AM
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని ఎన్టీఆర్ను సీఎం సీటు నుంచి దించిన వ్యక్తే ఈరోజు దండలు వేయడం దారుణమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ప్రపంచ రత్న అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. తెలంగాణలోని బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ అరెస్టు గురించి చంద్రబాబు నోరు విప్పట్లేదని అదే అరెస్ట్ ఏపీలో జరిగితే చంద్రబాబు నట విశ్వరూపం చూడాల్సి వచ్చేదన్నారు. పదవుల కోసం చంద్రబాబు దిగజారిపోయారని. టీడీపీని సర్వనాశనం చేసేది చంద్రబాబు, లోకేషే. దేవాలయాల ధ్వంసంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు తన హయాంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. దాడుల ఘటనల్లో టీడీపీ, బీజేపీ కార్యకర్తల ప్రమేయం ఉందన్నారు. మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టే నీచమైన స్థాయికి చంద్రబాబు వచ్చారని అన్నారు. చంద్రబాబు ఉడుత బెదిరింపులకు భయపడేది లేదు’ అని కొడాలి నాని అన్నారు.
Latest News