కూలీలపైకి దూసుకెళ్లిన ట్రక్కు..

by సూర్య | Tue, Jan 19, 2021, 08:11 AM

 గుజరాత్‌లోని కొసంబా జిల్లాలో సోమవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు అదుపుతప్పి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కూలీల పైనుంచి దూసుకెళ్లడంతో 15 మంది ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను, క్షతగాత్రులను రాజస్థాన్‌లోని బన్స్‌వాడ జిల్లాకు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. వేగంగా వెళ్తున్న ట్రక్కు ఎదురుగా చెరుకు లోడుతో వస్తున్న  ట్రాక్టర్‌ను ఢీకొని అదుపుతప్పి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కూలీల పైనుంచి దూసుకెళ్లిందని కంరేజ్‌ డివిజన్‌ డీఎస్పీ సీఎం జడేజా తెలిపారు. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప దవాఖానలకు తరలించారు. ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


 


 

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM